మహబూబ్నగర్, జూలై 16 : పట్టణాలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పను ల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బృహత్ పల్లెప్రకృతి వనాల పనులను ప్రారంభించి మొక్కలు నాటాలన్నారు. వైకుంఠధామాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తి చేసేందుకు సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు మురుగుకాల్వలను శుభ్రం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో యాదయ్య, పీఆర్ ఈఈ నరేందర్ ఉన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. హరితహారంలో భాగంగా కలెక్టరేట్లో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 10లక్షల 42వేల 830 మొక్కలు నాటినట్లు తెలిపారు. అలాగే కోటీ 18లక్షల విత్తనబంతులు చల్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నం దలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత, ఏవో ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.