మహబూబ్నగర్, సెఫ్టెంబర్ 26: జిల్లాకేంద్రంలో హైదరాబాద్కు తీసిపోకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మల్లికా దవాఖానలో ఆదివారం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్తో కూడిన 4డీ ఈసీహెచ్వో గుండెస్కానింగ్ మిషన్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అన్నిరంగాల్లో మహబూబ్నగర్ ఎంతో ఉన్నతస్థాయికి చేరుకోవడం శుభ పరిణామమన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు అందుబాటులో వైద్యసేవలను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్తో 4డీ ఈసీహెచ్వో గుండె స్కానింగ్ మిషన్ను మల్లికా దవాఖానలో ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలు, రాయిచూర్ తదితర ప్రాంతాలనుంచి కూడా గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మల్లికా దవాఖానకు దక్కుతుందన్నారు. ప్రభుత్వపరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని, పేదలకు సైతం మెరుగైన సేవలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మల్లికా దవాఖాన డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ మహేశ్బాబు, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శ్యామూల్, డాక్టర్ ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.