మహబూబ్నగర్టౌన్, జూలై 20: పాలమూరును సుం దర పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్ట ర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ చౌరస్తా నుంచి గ్రంథాలయ చౌరస్తా వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు, న్యూ టౌన్లో ప్రధాన రోడ్డు పనుల ను పరిశీలించారు. అదేవిధంగా న్యూ టౌన్ వక్ఫ్ స్థలంలో గొర్రె పొట్టేళ్ల విక్రయాలను పరిశీలించారు. అంతకుముందు వానగుట్ట రహెమానియా ఈద్గా వద్ద బక్రీద్ ఏర్పాట్లను అ ధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ నమాజ్ చేయాలని, రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అల్లా ను ప్రార్థించాలన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ఇసాక్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు షబ్బీర్, అనంతరెడ్డి, రామ్, షేక్ఉమర్, మోతీలాల్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అర్షద్అలీ, ఈద్గా కమిటీ ప్రతినిధులు మహ్మద్జకీ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మోసీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని చిన్నరాజమూరు ఆం జనేయస్వామి ఆలయాన్ని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డితో కలిసి మంత్రి దర్శించుకున్నారు. ఆల య అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి అర్చనలు చేసి ప్రత్యే క పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జె డ్పీటీసీ అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ కొండ సుగుణ, పీఏసీసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, వైస్ ఎం పీపీ సుజాత, సర్పంచ్ జయమ్మ, మాజీ ఎంపీపీ ఈవీ గో పాల్, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహరెడ్డి, నాయకు లు శ్రీకాంత్యాదవ్, కొండ శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రాంత కానిస్టేబుళ్లను పంపించాలి
ఆంధ్ర ప్రాంత కానిస్టేబుళ్లను వారి రాష్ర్టానికి పంపించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్సింగ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో సోమవారం ఉమ్మడి జి ల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోషియేషన్ సభ్యులు కలిశారు. మహబూబ్నగర్ జిల్లాలో ఐదుగురు ఆంధ్ర ప్రాంత కానిస్టేబుళ్లు ఇక్కడే పని చేస్తున్నారన్నారు. మంత్రి పలు సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారని వెల్లడించినట్లు వారు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో జీసీ నథానీల్, ఎం ఈ బాలరాజ్, ఎం కృష్టగౌడ్, జేబీ బి రాజు ఉన్నారు.