మహబూబ్నగర్, జూలై 18 : ఆరోగ్యం బాగా లేక మెరుగైన వైద్యం చేయించుకోవాలనుకునే వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ని మంత్రి క్యాంపు కార్యాలయంలో మ హబూబ్నగర్ నియోజకవర్గానికి చెంది న 24మందికి రూ.10,18,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఆరోగ్యం బాగాలేదు.. ఎవరి ని అడిగినా రూపాయి అప్పు ఇస్తలేరు.. ఆస్తులు కుదవపెట్టి ఆరోగ్యం మంచిగా చేసుకుందామనుకునే రోజులకు కాలం చెల్లిందన్నారు. పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. గ తంలో పేదలు అనారోగ్యానికి గురైతే ఎ న్నో ఇబ్బందులు పడేవారని గుర్తుచేశా రు. ప్రస్తుతం అప్పటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అలాగే ప్రైవేట్ వైద్యం పొందే వారిని సీఎంఆర్ఎఫ్తో ఆదుకుంటున్న ట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో పేదలకు ఇబ్బందులు ఏర్పడకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకూ అండ
ప్రతి కార్యకర్తకూ టీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కా ర్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన లక్ష్మయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా.. ఆయనకు టీఆర్ఎస్ సభ్య త్వం ఉండటంతో అతడి కుటుంబ స భ్యులకు రూ.2 లక్షల బీమా చెక్కును మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.