మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ముద్దుబిడ్డ, తె లుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆచార్యులు ఎ ల్లూరి శివారెడ్డికి తెలంగాణ సర్కార్ తగిన గుర్తింపునిచ్చింది. 2021 ఏడాదికి గానూ దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1992 నుంచి తెలుగు భాషా ఆచార్యుడిగా పనిచేస్తున్న శి వారెడ్డిది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ప్రస్తుతం వనపర్తి జిల్లా పరిధిలోకి వచ్చే చిన్నంబా వి మండలం కాలూరు ఆయన స్వగ్రా మం. పాలమూరు సాహిత్య సౌరభాలుగా ఖ్యాతి గడించిన ప్రముఖుల్లో ఎల్లూరి ఒకరు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గానూ సీఎం కేసీఆర్ గుర్తింపునిస్తూ ఈ ఏడాది దాశరథి పురస్కారానికి ఎంపిక చేశారు. గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. మారుమూల గ్రామం నుంచి తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసే స్థాయికి చేరుకున్న ఎల్లూరి సాహిత్య సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఉమ్మడి జిల్లా కళాకారులు పేర్కొంటున్నారు.
పాలమూరు సాహితీ లోకం హర్షాతిరేకాలు..
శివారెడ్డికి దాశరథి పురస్కారాన్ని అందించడంపై ప్రము ఖ కవి, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు జల జం సత్యనారాయణ, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సాహితీవేత్త బెక్కెం జనార్దన్ హర్షం వ్యక్తం చేశారు.
శివారెడ్డికి లభించిన గుర్తింపు..