మిడ్జిల్, జూలై 22 : విధినిర్వహణపై వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. గురువారం మిడ్జిల్ పీహెచ్సీని తనిఖీ చేశారు. దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12గంటలు అవుతున్నా వైద్యాధికారి వంశీప్రియ, అటెండర్ ఇమ్రాన్ దవాఖానలో లేకపోవడంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్షతో దవాఖాన మరమ్మతు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీ వో అనురాధ, పంచాయతీ కార్యదర్శి బాబ న్న, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలను అప్రమత్తం చేయాలి
వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ సీతారామారా వు అన్నారు. గురువారం తాసిల్దార్ కార్యాలయం, బాదేపల్లి ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. దవాఖానలో అన్ని విభాగాలను పరిశీలించడంతోపాటు కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం లో అ ధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థ ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిప ల్ కమిషనర్ సునీత, ఆర్ఐలు రాఘవేంద్ర, సుదర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు.
కోతకు గురైన రోడ్డు, కల్వర్టు పరిశీలన
మండలంలోని బలీదుపల్లి గ్రామంలో వర్షాలకు కోతకు గురైన రోడ్డు, కల్వర్టును అదన పు కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు. ప్రతి సంవత్సరం వర్షాలకు రోడ్డు, కల్వర్టు కోతకు గురవుతున్నదని సర్పంచ్ పద్మనర్సింహ, ఎంపీటీసీ గణేశ్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు వేణు అదనపు కలెక్టర్ దృ ష్టికి తీసుకెళ్లారు. కాగా, రోడ్డు, కల్వర్టు మరమ్మతుకు వెంటనే నివేదిక తయారు చేయాలని అదనపు కలెక్టర్ ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందు న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. పాడుబడిన ఇండ్లల్లో ఎవరూ ఉండకుండా ప్రతి గ్రామంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట తాసిల్దార్ కిషన్, డిప్యూ టీ తాసిల్దార్ శ్రీనివాసులు ఉన్నారు.