నారాయణపేట టౌన్, జూలై 20 : ఈ నెల 28న నిర్వహించే బాల అదాలత్ కార్యక్రమంతో బాలలు తమ సమస్యలు పరిష్కరించుకునేలా అధికారులు కృషి చేయాలని రా ష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యుడు దేవయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ 7కు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ జిల్లాలో అనాథలు, పాక్షిక అనాథలు, మానసిక దివ్యాంగులు, శారీరక దివ్యాంగులతోపాటు ఇత ర సమస్యలు ఎదుర్కొంటున్న బాలలు తమ సమస్యలను బాల అదాలత్లో తెలియజేయడంతో పరిష్కరించుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు.కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్ 7లో భాగంగా జిల్లాలో రెస్క్యూ చేసిన బాలలకు కౌన్సెలిం గ్ ఇవ్వడంతో వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్ 7లో బాలకార్మికులుగా గుర్తించిన బాలల చదువుకు సం బంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.