కృష్ణ, జూలై 23 : మండలంలోని కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో శుక్రవారం కృష్ణానది లో నీటి ప్రవాహం ఉధృతమవుతున్నందున తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చేయాలని ఎస్సై మురళిని ఎస్పీ ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కృష్ణ పో లీస్స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నదీ తీర ప్రాం తంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మాగనూర్, కృష్ణ మండలాల్లోని ముంపునకు గురయ్యే కుసుమూర్తి, తంగిడి గి, సుకూర్లింగంపల్లి గ్రామాల్లో పర్యవేక్షిస్తూ ప్రజలతో మాట్లాడారు. గ్రా మాల్లో పోలీస్ బందోబస్త్తు చేస్తూ 24 గంటలపాటు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
పోలీస్ అధికారులు, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులసమన్వయంతో కర్ణాటక రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తె లుసుకొని ప్రజలకు తెలియజేయాల న్నారు. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచనలు చేస్తుంద ని, దీంతో నదిలో నీటి ప్రవాహం పె రిగే అవకాశం ఉందన్నారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి నదిలోకి వెళ్తే చట్ట ప్రకారం చర్య లు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, నారాయణపేట అదనపు ఎస్పీ (డీఏఆర్) భరత్, డీఎస్పీ మధుసూదన్రావు, సీఐ శంకర్, ఎస్సై మురళి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.