హన్వాడ, జూలై 19 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్వాడ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సుమారు రూ.6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఏ వార్డుకు వెళ్లినా సమస్యలే కనిపించేవి. నేడు గ్రామంలో ఎక్కడా సమస్యలు లేవు. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో గ్రామంలో చాలా సమస్యలు పరిష్కరించారు. 681 మందికి ప్రతి నెలా రూ.15,25,456 పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.
పరిశుభ్రత, హరితహారంపై దృష్టి..
గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి వార్డు వార్డుకు తిరిగి ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 15 రోజులకోసారి పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. నెలకు రెండుసార్లు వాటర్ ట్యాంకులను క్లీన్ చేయిస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఆయా వార్డుల్లో సీసీరోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేశారు. మూడు రోజులకోసారి గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్లు పడుతున్నారు. నాటిన మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటుతున్నారు. గ్రామంలో సుమారుగా 40 వేల మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించేందుకు కూలీలను నియమించారు.
గ్రామంలో చేపట్టిన ప్రగతి..
జరుగుతున్న పనులు..