వెల్దండ, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయి. సీ ఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రా మాలకు వన్నె తెస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామం పల్లె ప్రగతిలో చేపట్టిన పనులతో ఆదర్శంగా నిలుస్తున్నది. 2,451 జనాభా ఉన్న కొట్ర గ్రామం దినదినాభివృద్ధి చెందుతున్నది. గ్రామంలో దాదాపు అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి.
రూ.1.08 కోట్లతో ప్రగతి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. పల్లె ప్రగతి, జీపీ నిధులు కలుపుకొని ఇప్పటివరకు దాదాపుగా రూ.1.08 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ. 2.5 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్, రూ.12 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.40 లక్షలతో సీసీ రో డ్లు, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.4 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు, రూ.16 లక్షల తో ఎల్ఈడీ లైట్ల బిగింపు, హరితహారం.. ఇలా అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల వెంట మొ క్కలు నాటడం, ప్రమాదకరంగా ఉన్న బావుల పూడ్చివేత, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల కూల్చివేత, చెత్త సేకరణ, అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, వీధి లైట్లతో గ్రామం నూత న శోభ సంతరించుకున్నది. గ్రామ పంచాయతీ భవనం పచ్చ ని చెట్లతో కళకళలాడుతున్నది. వంద శాతం మరుగుదొ డ్లు నిర్మించారు. ఇంటింటికీ మి షన్ భగీరథ తాగు నీరు సరఫరా అవుతున్నది.
ప్రత్యేక ఆకర్షణగా రైతు వేదిక..
జిల్లాలోనే మొట్టమొదటిగా నిర్మించిన కొట్ర రైతువేది క భవనం ఎంతో ఆకర్షణగా నిలిచింది. భవనం ఎదుట నాటిన మొ క్కలు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్నాయి. భవనానికి మూడు వైపులా నాటిన మొక్కలను సంరక్షించడంతో ఏపుగా పెరిగా యి. అక్కడికి వచ్చిన ప్రజలు మొక్కలు
ఎంత బాగా పెరిగాయంటూ కితాబిస్తున్నారు.
హరిత గ్రామంగా తీర్చిదిద్దుతాం..
హరిత గ్రామంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకు న్నాం. ఓపెన్ డ్రైనేజీ లేకుండా చేస్తా. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదదవ్ సహకారంతో గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్, హెల్త్ సెంటర్, ఓపెన్ జిమ్, మినీ చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తా. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపడుతాం. పారిశుధ్యం, మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గ్రామస్తులు, అధికారుల సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధిలో నెంబర్వన్గా నిలుపుతా.