మక్తల్ టౌన్, జూలై 20 : తెలంగాణ ఆడపడుచులకు సీ ఎం కేసీఆర్ అండగా ఉండి, పెండ్లికి చేయూత అందిస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవా రం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 66 మంది ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కాలంలోనూ పథకాలను సజావుగా అమలు చేస్తూ పేదలకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నారన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటి ఆడబిడ్డకు పెండ్లి కనుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆదుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సం క్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామగ్రామానా చేపడుతున్నారన్నారు. సీనియర్ నాయకుడు శ్రీనివాస్గుప్తా పోలీసులకు ఎమ్మెల్యే నివాసంలో ఎన్.95 మాస్కులు అందజేశారు. కార్యక్రమం లో మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, తాసిల్దార్ నర్సింగ్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు
మాగనూర్ మండలంలోని వడ్వాట్ రైతుబంధు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరయ్యారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నరసింహారెడ్డికి తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే శాలువా తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.