నారాయణపేట టౌన్, జూలై 19 : సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి లేవనెత్తిన సమస్యలు సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. సోమవారం ప ట్టణంలోని శీలాగార్డెన్ ఫంక్షన్ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ అ ధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య స మావేశానికి ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. మండలస్థాయిలో జరిగే సమావేశాలకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెంచాలి
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. యాసంగి సీజన్లో అనుకున్న దానికన్నా అధికంగా ధాన్యం ఉత్పత్తి కావడంతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సైప్లె అధికారుల స మన్వయం కొరవడి కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వందశాతం కొనుగోళ్లను పూర్తి చేశారని చెప్పారు. రాబోయే సీజన్లో పంట ది గుబడి పెరిగే అవకాశం ఉన్నందున వ్య వసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందు లు లేకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ.55 కోట్లు, అధికారు ల నివాస సముదాయాలకు రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డీపీఆర్ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు, భవనాల కార్యనిర్వాహక ఇంజినీర్ను ఆదేశించారు.
మరమ్మతులు చేపట్టాలి
జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమతులు చేపట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని, ప్రతి మండలంలో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునేలా గోదాముల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని, లికేజీల వద్ద మరమ్మతులు చేపట్టాలన్నారు.