మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీసులకు ఉత్కృష్ట, ఆరుగురికి సేవా పతకాలు లభించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న రేలా జనార్థన్రెడ్డి, హోంగార్డుగా పని చేస్తున్న ఎండీ.మక్సూద్కు ఉత్కరిస్ట్ సేవా పథకాలు, జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సైలు సూరయ్య, ఎస్కే.ఇమాం, ఎం.సంజీవరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బి.ఉప్పలయ్య, కానిస్టేబుల్ ఎన్.శ్రీనివాసరావులకు సేవా పథకాలు అందించనున్నట్లు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిందని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ పతకాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.