కేసముద్రం ఏప్రిల్ 30: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంక న్న సూచించారు. మండలంలోని కల్వల గ్రామంలో శుక్రవా రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు మద్దతు ధర కల్పించేందుకే సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. చెత్త లేకుండా ధాన్యాన్ని విక్రయానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స ర్పం చ్ గంట సంజీవరెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ డీ ప్రవీణ్కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఏ మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి మోడెం రవీందర్ గౌడ్, గ్రామస్తులు బొడ్డు భిక్షం, కొంతం శ్రీనివాస్, డీ రాజు, నూనావత్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి వెంకన్న, ఏఈవో మమత ఉన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తాం
డోర్నకల్: డోర్నకల్ వ్యవసాయ (గ్రైయిన్ మార్కెట్) మార్కెట్లో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. శుక్రవారం మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి రైతులు సహకరించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ను రైతులు సద్వివినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్న రమణ, జిల్లా టీఆర్ఎస్ నాయకులు బీ పిచ్చిరెడ్డి , జిల్లా ఆత్మ చైర్మన్ తోట లాలయ్య, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షం రెడ్డి, వార్డు కౌన్సిలర్లు బీ శరత్ బాబు, పోటు జనార్దన్, మాజీ జడ్పీటీసీ గొర్ల సత్తిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు టీ రమేశ్ నాయక్, కొత్త వీరన్న, మార్కెట్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, డీ కృష్ణ పాల్గొన్నారు.