Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను మహబూబాబాద్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మహబూబాబాద్కు చెందిన తోకల రోహిత్, ఆజాం, తాళ్లపూసపల్లికి చెందిన కందుకూరి సాయి, నాగుల సుధీర్ కారులో మానుకోట నుంచి తాళ్లపూసపల్లికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. రోహిత్, సాయి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆజాం, సుధీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.