మహబూబాబాద్ :జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రానికి జన ఆశీర్వాద యాత్రకు విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ వెంకట్, దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పాస్ చేయాలని మంత్రిని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ డౌన్ డౌన్..కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.