నెల్లికుదురు : సీమాంధ్ర పాలన నుంచి విముక్తి పొంది నీళ్లు, నిధులు, నియామకాలు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు ముందుకు సాగుతున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఇటీవల విద్యుదాఘాతంతో 6 పశువులు మృతి చెందాయి. దీంతో సంబంధిత రైతులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం బాధిత రైతులకు ఒక్కొక్కరికీ రూ. 40 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో కరెంట్ కష్టాలను పట్టించుకోలే…, విద్యుఘాతంతో పాడిపశువులు మృతి చెందినా పట్టించున్న పాపాన పోలే.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినా, కరెంట్ షాక్లతో పశువులు మృతి చెందినా తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తు బాధితులకు బరోసాగా నిలుస్తున్నదన్నారు. త్వరలో జరుగనున్న ప్లీనరీ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుపాటి వెంకట్ రెడ్డి, దర్శనం భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ భూక్యా బాలాజీ నాయక్, మండల కో-ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.