మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎంపీ మాలోతు కవిత అన్నారు.సోమవారం మండల పరిధిలోని మల్యాల గ్రామంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మల్యాల గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆవుల వెంకన్న తల్లి గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
సోమవారం గంగమ్మ దశదిన కర్మలకు ఎంపీ, జిల్లా టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా, పర్కాల శ్రీనివాస రెడ్డి, కేసన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, బోడ లక్ష్మణ్ నాయక్, వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.