HomeWarangal-ruralThe Cooperation Of The Peoples Representatives Should Be Sought For The Goals Of Vaccination
వ్యాక్సినేషన్ లక్ష్యాలకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కే.శశాంక
మహబూబాబాద్ : జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ కోసం వైద్యాధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ కే.శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యాధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిన జిల్లాగా మానుకోటను నిలిపేందుకు అధికారులందరూ ప్రత్యేకంగా పని చేయాలన్నారు. రూరల్లో 79.1 శాతం పూర్తి కాగా, మిగతా 21 శాతం పూర్తి చేసేందుకు ఇంటింటా సర్వేచేయాలన్నారు.
ఒక గ్రామం పూర్తయిన వెంటనే మరో గ్రామంపై దృష్టి కేంద్రీకరించేలా వైద్యాధికారులు ప్రణాళిక చేపట్టాలన్నారు. నూరు శాతం పూర్తయిన గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి గ్రామ అధికారులు, సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, ఉప వైద్యాధికారులు అంబరీష, మురళీధర్, వైద్యులు దిలీప్, అరుణ, మహబూబాబాద్, తొరూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు ప్రసన్నరాణి, గుండెబాబు, వెంకటేశ్వర్లు, గణేశ్ పాల్గొన్నారు.