శ్రీశైలం, మే 16 : శ్రీశైల భ్రమరాంబికామల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సోమవారం పుర వీధులన్నీ కిటకిటలాడాయి. వందల సంఖ్యలో వచ్చిన దంపతులు సామూహిక అభిషేకాలతోపాటు వృద్ధ మల్లికార్జున స్వా మికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. స్వామి, అమ్మవార్లకు సా యంత్రం ఈవో లవన్న ఆధ్వరంలో సహస్ర దీపార్చన నిర్వహించారు. దీపాలంకరణ మండపంలో లోక కల్యాణార్థం సంకల్పాన్ని పఠించారు.
అనంతరం వేదపండితులతోపాటు ధర్మకర్తల మండలి సభ్యురాలు విజయలక్ష్మిసుబ్బరాయుడు దంపతులు దీ పాలు వెలిగించారు. ప్రదోష కాలంలో ఆదిదేవులను వెండి రథంపై అధిష్ఠింపజేసి ఆల య ప్రదక్షిణలు చేశారు. దక్షిణ మాడవీధి హరిహరరాయ గోపురం వద్ద నిర్వహించిన ధర్మపథంలో భాగంగా హైదరాబాద్కు చెందిన వీఎన్ఆర్ కళాక్షేత్రంవారి సంగీతవిభా వరి, శాంభవి డాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యాలు అలరించాయి.