మహబూబాబాద్ : మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు ఓ కర్కోఠకుడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన మల్లయ్య-కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నర్సయ్య మద్యానికి బానిసకావడంతో భార్య వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా అతనిలో మార్పురాలేదు.
మంగళవారం మధ్యాహ్నం తల్లి కమలమ్మ ఇంట్లో భోజనం చేస్తుండగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న నర్సయ్య తల్లిని డబ్బుల కోసం వేధించాడు. డబ్బులు లేవని ఆమె తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికిలోనై పక్కనే ఉన్న సిమెంట్ రాయితో తల, ముఖంపై విక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కమలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నర్సయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.