మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి దుకాణంలో చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.10 లక్షల విలువైన విత్తనాలు, రూ.1.50 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇవాళ విషయం గ్రహించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.