మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా ఎంతో మంది రైతులకు సహాయం చేసారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు సంబురాల్లో పాల్గొని కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులతో కలిసి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం ఒక పండుగలాగా ఈ సంబురాలు రైతులు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రైతుల కన్నీళ్లు తుడుస్తూ సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయం అన్నారు.
రైతుబంధు సాయంతో రైతులు అప్పుడు పాలుకాకుండా పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు,వ్యవసాయ మార్కెట్ అధికారులు,మార్కెట్ చైర్మన్లు పాల్గొన్నారు.