మహబూబాబాద్ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం డోర్నకల్ మండలంలోని చాప్ల తండా ప్రాంతంలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్యాకేజీ -15 పనులను వేసవిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోజుకు నిర్ణీత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తూ.. వర్షాకాలం రాకముందే వేసవిలోగా పనులు
పూర్తి చేయాలన్నారు. రైతులకు అందాల్సిన భూసేకరణ నష్టపరిహారాన్ని త్వరలో అందజేస్తామని తెలిపారు.
ప్రాజెక్ట్ పనులకు ఆటంకం కలగకుండా శరవేగంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, సీఈ శంకర్ నాయక్, ఎస్.ఈ. రవికుమార్, ఈఈ సమ్మి రెడ్డి, డీఈ రమేష్, డోర్నకల్ తహశీల్దార్ వివేక్, తదితరులు పాల్గొన్నారు.