మహబూబాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యాలను సీఎంఆర్ఎఫ్ పథకం కాపాడుతుందని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి 16 మంది లబ్ధిదారులకు రూ.21, 00, 500లకు సంబందించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదల ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. ఎక్కడా కూడా పేదలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దనే సదుద్ధేశ్యంతో ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుందని చెప్పారు.
ఆపద వస్తే సీఎం కేసీఆర్ ఆదుకుంటారనేందుకు ఈ పథకమే ప్రత్యక్ష ఉదహరణగా చెప్పవచ్చన్నారు. నిరుపేదలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహబూబ్పాషా, సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాసరెడ్డి, ముత్యం వెంకన్న, నల్లాని నవీన్రావు, పంజాల శ్రీను, పొన్నాల యుగంధర్, దాసరి రావీష్, బోడ లక్ష్మణ్ పాల్గొన్నారు.