మహబూబాబాద్: మానుకోట అభివృద్ధే తన ఆశయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మానుకోట రూపురేఖలు మారుతున్నాయని, మరికొన్ని రోజుల్లో మహబూబాబాద్ పట్టణం సుందరంగా మారబోతున్నదని చెప్పారు. మహబూబాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మానుకోట అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, ఒక్క వ్యాపారి కూడా నష్టపోకుండా, అందరికీ వ్యాపారం చేసుకునేలా త్వరలో సర్వహంగులతో మోడల్ మార్కెట్ను నిర్మిస్తామన్నారు.