మహబూబాబాద్: రాష్ట్రంలోని పేదలంతా మూడు పూటలా అన్నం తినాలని, ఒక్కరు కూడా పస్తుండకూడదనే విశాల హృదయంతో సీఎం కేసీఆర్ పేదలకు రేషన్ కార్డులు ఇస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదుర్లో లబ్ధిదారులకు 301 కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాహబూబాబాద్ నియోజకవర్గంలో సోమవారం 2194 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందరికి సహాయం చేస్తున్నదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి రేషన్కార్డును అందిస్తున్నామని వెల్లడించారు.