మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శనివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట స్థానిక నాయకులు టి.ఆర్.ఎస్ వద్దిరాజు రవిచంద్ర తదితరులున్నారు.