మహబూబాబాద్ : అవకాశం కల్పిస్తే గిరిజన బిడ్డలు అద్భుతాలు సృష్టిస్తారని నమ్మిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజన విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అక్కడి విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో సీటు సాధిస్తూ మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా సీరోల్, బయ్యారంలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్.దీక్షిత(సీరొల్), బానోత్ నిహారిక(బయ్యారం) ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఆగా ఖాన్ అకాడమీ లో అడ్మిషన్ సాధించడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు.
ప్రతిభ కలిగిన పేదింటి బిడ్డలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులు, రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.