మహబూబాబాద్ : దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక దళిత బంధు గ్రౌండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి యూనిట్ల గ్రౌండింగ్ చేయుటకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 305 మంది లబ్ధిదారులను స్థానిక ప్రజా ప్రతినిధుల ఆమోదంతో ఎంపిక చేశామని, గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రవాణా సంబంధిత యూనిట్ ఏర్పాటు సమయంలో లైసెన్స్ ఉన్న వారికి మొదటగా మంజూరు చేయాలని, లైసెన్స్ లేని వారితో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయించాలని తెలిపారు.