ఖానాపురం, మే 7: మండలంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రజలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కరోనా యాక్టివ్ కేసులు 277 ఉన్నాయన్నారు. అశోక్నగర్, ఖానాపురం, బుధరావుపేట, కీర్యతండా గ్రామాల్లో అధికంగా నమోదవుతున్నాయన్నారు. అధికారులు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని, పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువ మందిని అనుమతి ఇవ్వొద్దన్నారు. గ్రామాల్లో కేసులు పెరిగితే స్థానికంగా ఉన్న ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.