కేసముద్రం : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని తాళ్ళపూసపల్లి, ధన్నసరి గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులు వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగ అభివృద్ధికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. రైతులను ఆదుకునేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తేమ శాతం 17కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని సూచించారు.
తాలు, తేమ పేరుతో ధాన్యం బస్తాల్లో కోత విదిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్క్పేడ్ రాష్ట్ర డైరెక్టర్ మరి రంగారావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, డీసీవో కుర్షిత్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్కుమార్, ఆత్మ చైర్మన్ పోలెపల్లి నెర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, ఎంపీపీ రావుల నవీన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రావుల రవిచందర్రెడ్డి ఉన్నారు.