మహబుబాబద్ : సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. గురువారం మహబుబాబాద్ నిజం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దెశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుందని తెలిపారు. గతంలో చెరువుల్లో నీరులేక మత్స్యకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే వారని కానీ ఇప్పుడు మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో చెరువులు జల సిరితో కళకళలాడుతున్నాయని తెలిపారు. దీంతో మత్స్య సంపద వృద్ధి చెందిందన్నారు.