మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మే 26: మానవాళి ప్రగతికి బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుధవారం మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం, అందులోని మూలాలు, బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయన్నారు. నాగార్జునసాగర్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయంగా బౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడడమే గౌతమ బుద్ధుడికి నిజమైన నివాళి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతున్నదని మంత్రి అన్నారు.