ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్, మే 25 : పోలీసులు మానసిక ధైర్యాన్ని పెం పొందించుకోవాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. కరోనా బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బందికి మంగళవారం ఆయన తన కార్యాలయంలో డ్రైఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచు కోవాలన్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలని చెప్పారు. విధులు నిర్వర్తించే సమయంలో మాస్క్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ యోగేశ్ గౌతమ్, ఏఆర్ డీఎస్పీ జనార్దన్రెడ్డి, టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం, బయ్యారం సీఐ తిరుపతి, ఆర్ఐలు పూర్ణచందర్, నర్సయ్య, సురేశ్ పాల్గొన్నారు.