నర్సంపేట, ఏప్రిల్ 22: కరోనా వైరస్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. నర్సంపేటలో ప్రైవేట్ టీచర్లకు గురువారం ఆమె బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రైవేట్ టీచర్లను ఆదుకుంటున్నారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మూర్తి, కౌన్సిలర్ బానాల ఇందిర పాల్గొన్నారు.
దుగ్గొండి: తిమ్మంపేటలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విద్యాసాగర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎలకంటి కుమారస్వామి, తోటకూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు సాంబశివుడు, దండు రాజు, దండు కరుణాకర్, మచ్చిక రజిత పాల్గొన్నారు.
శాయంపేట: మండలకేంద్రంలో ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ కందగట్ల రవి ప్రారంభించారు. ప్రభుత్వం మానవతాదృక్పథంతో ప్రైవేట్ టీచర్లకు రూ. 2 వేలు, సన్న బియ్యం అందిస్తున్నదని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో నవోదయ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మామిడి శరత్, రేషన్డీలర్లు కాంబత్తుల ప్రకాశ, బాబురావు, టీచర్లు ప్రశాంత్, రాజేందర్, రాజు, సుమలత పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్లకు అండగా..
రాయపర్తి: కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు కొండూరులో ప్రైవేట్ టీచర్లకు సన్నబియ్యం పంపిణీని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమారస్వామి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంఈవో నోముల రంగయ్య, ఎంపీటీసీలు అయిత రాంచందర్, బిల్ల సుభాశ్రెడ్డి, మహ్మద్ అస్గర్ అలీ, పెదగాని సాంబయ్య, ఏ సంతోష్కుమార్, కర్ర సరిత, చిర్ర ఉపేంద్ర, పూస మధు, ఉపేందర్, పీ శ్యాంరావు, మహేశ్ పాల్గొన్నారు.
సంగెం: ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. మండలకేంద్రంతో పాటు కుంటపల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సర్పంచ్లు గుండేటి బాబు, కావటి వెంకటయ్య, ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్బాబు, కోడూరి సదయ్య, అప్పె నాగార్జునశర్మ, సీఆర్పీలు రాజు, శ్రీధర్, ఎం శంకర్, ఐఈఆర్పీ టీ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్లు మొగిలి, మల్లేశం, క్రాంతికుమార్, ఎడ్ల వినోద్కుమార్, పులి రాజు పాల్గొన్నారు.
జనహృదయ నేత సీఎం కేసీఆర్
ఆత్మకూరు: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ జనహృదయ నేత అని జడ్పీటీసీ కక్కెర్ల రాధిక-రాజు అన్నారు. మండలకేంద్రంలోని ప్రైవేట్ టీచర్లకు బియ్యాన్ని జడ్పీటీసీ, ఎంపీపీ మార్క సుమలత పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులను గుర్తించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పర్వతగిరి రాజు, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, ఎంపీటీసీ బయ్య రమ-రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కక్కెర్ల రాజు, మార్క రజినీకర్గౌడ్, వార్డు సభ్యులు రేవూరి ప్రవీణ్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బీ పైడి పాల్గొన్నారు.
గీసుగొండ: ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని శాయంపేట సర్పంచ్ రాజబోయిన రజిత అన్నారు. గ్రామంలో ప్రైవేట్ టీచర్లకు రూ. 2 వేల నగదు, 25 కేజీల సన్నబియ్యాన్ని ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కాయిత భిక్షపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
దామెర: ఊరుగొండలో ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న 25 కిలోల సన్నబియ్యాన్ని ఎంపీపీ కాగితాల శంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజొద్దీన్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, ఎంపీటీసీ గండు రామకృష్ణ, సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, వీఆర్వో బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నేరెళ్ల కమలాకర్, ఏఎంసీ డైరెక్టర్ ఆరె వెంకట్రెడ్డి, డీలర్లు చంద్రమౌళి, రాజు, ప్రేమసాగర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, తిరుపతిరెడ్డి, వార్డు సభ్యుడు మల్లయ్య పాల్గొన్నారు.