గూడూరు, ఏప్రిల్ 22 : ఇది మండలంలోని పాకాలవాగు. గతంలో వేసవి వచ్చిదంటే చుక్క నీరులేక, ఇసుక దిబ్బలతో సలసల మాడిపోయేది. గొడ్డూగోద, చుట్టపక్కల జనం నీళ్ల కోసం అల్లాడిపోయేవారు. స్వరాష్ట్రంలో అపర భగీరథుడు సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో సాగునీటి కల సాకారమై, మండుటెండల్లోనూ పాకాలవాగు పరవళ్లు తొక్కుతున్నది. 2001లో గూడూరు మండలాన్ని సందర్శించిన కేసీఆర్ తెలంగాణ వస్తే పాకాలవాగుపై చెక్డ్యాంలు నిర్మించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. పాకాల వాగుపై తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా బూడిదనడుమ అనే ప్రాంతంలో వాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పూర్తికావొచ్చింది. 60 మీటర్ల వెడల్పు, 9 ఫీట్ల ఎత్తుతో నిర్మించిన చెక్డ్యాంపై నుంచి గురువారం పాకాల జలాలు ఉరకలేస్తూ, అన్నదాతల కలను సాకారం చేశాయి.
ఇవి కూడా చదవండి
హర్యానాలో దుకాణాలు బంద్, సమావేశాలపై నిషేదం
మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నేతలు