నర్సంపేట/చెన్నారావుపేట/శాయంపేట/దామెర, మే19: ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో లాక్డౌన్ విజయవం తంగా అమలవుతున్నది. బుధవారం నర్సంపేటలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారుల కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు. అత్యవసర పనులపై పట్టణానికి వస్తున్న వారినే అనుమతిస్తున్నారు. పోలీసులు చెక్పోస్టుల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని నర్సంపేట ఎస్సై నవీన్కుమార్ కోరారు. ఇదిలా ఉండగా నెక్కొండ- నర్సంపేట ప్రధాన రహదారిపై చెన్నారావుపేటలో ఎస్సై శీలం రవి లాక్డౌన్ను పర్యవేక్షించారు.
లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన 20 మంది వాహనదారులకు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మండలంలో కరోనా కేసుల పెరుగుతున్నం దున లాక్డౌన్ను అమలు చేయాలని కోరారు. ఆయన వెట ట్రైనీ ఎస్సై మహేందర్, కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్ ఉన్నారు. శాయంపేట మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా అమలవుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నారు. అనంతరం దుకాణాలు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐ తోగిటి రమేష్కుమార్, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ బందోబస్తు పర్యవేక్షించారు. దామెర మండలంలోని బుధవారం లాక్డౌన్ కొనసాగింది. దామెర, ఊరుగొండ, పులుకుర్తి, ఒగ్లాపురం గ్రా మాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానాలు విధించారు. ఎస్సై భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు.