ఎమ్మెల్యే రెడ్యానాయక్
మానుకోటకు మెడికల్, నర్సింగ్ కాలేజీల మంజూరుపై కేసీఆర్కు కృతజ్ఞతలు
చిన్నగూడూరు మే18 (మరిపెడ) : సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే రెడ్యానా యక్ అన్నారు. మంగళవారం ఆయన మరిపెడ మున్సిప ల్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల ఆరాధ్యుడిగా మారారని అన్నారు. మానుకోట జిల్లాకు మెడికల్ కాలేజీ, దానికి అనుబంధం గా నర్సింగ్ కాలేజీ, ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేసిన కేసీఆర్కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పుష్కలం గా నీరు ఉందని, ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని, అధైర్యపడొద్దన్నారు. గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ చైర్మన్ గుడిపుడి నవీన్రావు, ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, వైస్ ఎంపీపీ అశోక్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రఘు, నాయకులు మహేందర్రెడ్డి, రాంబాబు, రవీందర్ పాల్గొన్నారు.