గీసుగొండ/రాయపర్తి, మే 12: దవాఖానల్లో నర్సుల సేవలు మరువలేనివని గీసుగొండ ఎంపీపీ సౌజన్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం నర్సులను సన్మానించారు. కార్యక్రమంలో గనిపాక ప్రదీప్, మండల కోప్షన్ సభ్యుడు రహీం పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న నర్సులు సాక్షాత్తు దైవదూతలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు. రాయపర్తి మండలకేంద్రంలోని పీహెచ్సీలో నర్సులు, వైద్య సిబ్బందిని రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి ఆయన సన్మానించారు. కార్యక్రమంలో రాయపర్తి-2 ఎంపీటీసీ అయిత రాంచందర్, మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, వైద్య సిబ్బంది ధరావత్ భీమానాయక్, ప్రభాకర్, మణి, జయలత, ఉబ్బని రజిత, శ్యాంసుందర్, విజయ, అస్గర్ అలీ పాల్గొన్నారు.