ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాలాక్డౌన్ సడలింపు సమయంలో రోడ్డెక్కిన సర్వీసులు
చాలా బస్సులు హన్మకొండ బస్స్టేషన్కే పరిమితం..
కరోనా నిబంధనలతో నడిపిస్తాం : ఆర్ఎం
హన్మకొండ చౌరస్తా, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా బస్సులు హన్మకొండ బస్స్టేషన్కే పరిమితమయ్యాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్స్టేషన్ వెలవెలబోయింది. వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, తొర్రూరు, జనగామ, మహబూబాబాద్ డిపోల పరిధిలో కేవలం 48 బస్సులు రోడ్డెక్కాయి. బుధవాం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బస్సులు నడిపారు.
పరిమిత సంఖ్యలో..
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులు నడిచాయి. హన్మకొండ బస్టాండ్ నుంచి హైదరాబాద్కు ఉదయం 6.30, 6.45, 7.00, జనగామ, నర్సంపేట, తొర్రూరు, పరకాలకు 6.30, 7.00, 7.30, 8.00, 8.30, అలాగే భూపాలపల్లికి 6.45, 7.45, 8.15, ములుగుకు 6.30, 7.00, ఏటూరునాగారంకు 6.45, 7.45, 8.15, మంగపేటకు 7.00, 7.45, హుస్నాబాద్కు 6.30, 7.00, 7.30, కరీంనగర్కు 6.30, 7.00, 7.30, 8.00, 8.30 గంటల సమయంలో బస్సులను నడుపనున్నట్లు వరంగల్ అర్బన్ డివిజినల్ మేనేజర్ తోట శ్రీనివాసరావు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి రోజూ సడలింపు సమయంలో బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ఎస్వీజీ కృష్ణమూర్తి తెలిపారు.