తొర్రూరు, మే11 : ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు. మంగళవారం ఆయన అన్నారం రోడ్డులో వారాంతపు సంతను పరిశీలించి మాట్లాడారు. విక్రయదారులు భౌతికదూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు లేనివారికి జరిమానాలు విధించాలన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారులు ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని, పర్యవేక్షణ కోసం పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. సంతలో గుంపులు గుంపులు ఉండొద్దని, నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, రోజా, మున్సిపల్ సిబ్బంది స్వామి, స్థానికులు రాజు, తదితరులు పాల్గొన్నారు.