నర్సంపేట, జూన్11: మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల సేకరణలో నిమగ్నమయ్యారు. నర్సంపేట డివిజన్లోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు రెండు రోజులుగా పంటల సాగుపై దృష్టి సారించారు. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులు కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఏ పంలు సాగు చేయాలనే విషయమై ఇప్పటికే అంచనా వేసుకున్న రైతులు కార్యాచరణ చేపటారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు అత్యధికులు పత్తి సాగును ఎంచుకున్నారు. మరోవైపు పంటల మార్పి డి విధానం అమలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మం దుల దుకాణాలకు నిత్యం పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు.
శాయంపేటలో..
శాయంపేట : ఈసారి వర్షాలు ముందస్తుగా కురుస్తుండడంతో మండలంలోని అత్యధిక రైతు లు పత్తి విత్తనాలు సాగు చేస్తున్నా రు. గత వానకాలం సీజన్లో 9,450 ఎకరాల్లో పత్తిని సాగు చేశా రు. తర్వాత మొక్కజొన్న, వరి పంటలను పండిస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తుండడంతో రైతులు కుటుంబ స భ్యులతో కలిసి పత్తి సాళ్లల్లో విత్తనా లు వేస్తున్నారు. గ్రామాల పరిధిలో ఎక్కడచూసినా రైతులు ఎడ్ల నాగళ్లతో కనిపిస్తున్నారు. ఈ సీజన్కు ముందుగానే పత్తి విత్తనాలను రైతులు సేకరించారు.
రాయపర్తిలో..
రాయపర్తి : మండలంలోని రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఏరువాక పనులు జోరుగా సాగిస్తున్నారు. పంటల సాగులో భాగంగా విత్తనాలు సేకరిస్తున్నారు. తొర్రూరుతో పాటు, వరంగల్ నగరానికి రైతులు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. వానకాలం సీ జన్తో వ్యవసాయదారులకు తోడు కూలీలకు పని దొరుకుతోంది.
గీసుగొండలో..
గీసుగొండ : ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశముండడంతో అన్నదాతలు పంటల సాగు చేపట్టారు. వారం రోజుల క్రితం మండలంలో భారీ వర్షం కురవడంతో దుక్కు లు దున్ని విత్తనాలు సాగు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఏ గ్రామంలో చూసిన ఎక్కువ మంది రైతులు పత్తి విత్తనాలను వేస్తున్నారు.