సీఎం, ఎమ్మెల్యే చిత్రపటానికిస్థానికుల పాలాభిషేకం
భూపాలపల్లి టౌన్, మే 10: ఎన్నో ఏళ్లుగా పెం డింగ్లో ఉన్న ఓసీ -2 నిర్వాసితుల సమస్య పరి ష్కారానికి నోచుకుంది. ఓపెన్కాస్టు 2 కోసం ఫకీ ర్గడ్డ, ఆకుదారివడ భూములను, ఇండ్లను సింగ రేణి సంస్థ తీసుకుంది. అయితే పరిహారం, ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ ఇంతవరకు చెల్లించకపోవ డం తో నిర్వాసితులు పలుమార్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సర్వే ప్రారంభించి పరిహారం అందించా లని ఎమ్మెల్యే సింగరేణి అధికారులతో పలుమా ర్లు సమీక్ష నిర్వహించి ఆదేశించారు. కాగా ఎట్టకే లకు సోమవారం ఓసీ 2 ప్రభావిత గ్రామాలు, భూముల్లో సింగరేణి అధికారులు సర్వే ప్రారం భించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ రైతు సెగ్గం శంకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీ ఆర్, ఎమ్మెల్యే గండ్ర చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిర్వాసిత రైతు శంకర్ మాట్లాడుతూ ఇన్నేళ్లకు సమస్య పరిష్కార మవడం సంతోషంగా ఉందన్నారు. తామంతా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సెగ్గం ఎల్లారం, లక్ష్మి, రాజస మ్మయ్య, పెద్ద రాజ య్య. దుర్గం బానేశ్, సెగ్గం చిన్న రాజయ్య, అక్క పల్లి సంపత్, బౌతు రాజ య్య, గంట సమ్మయ్య, జాడి లావ ణ్య, సెగ్గం శంకర్, దశరథం, మల్లక్క, రాజు, రమాదేవి, రాజ్కుమార్ పాల్గొన్నారు.