భూపాలపల్లిలోని యూనియన్ కార్యాలయం ఎదుట రాజేందర్ దిష్టిబొమ్మ దహనం
కృష్ణకాలనీ, జూన్ 5: పదవులిచ్చి, అన్నిట్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి, పేదల భూములు ఆక్రమించుకున్న మోసగాడు ఈటల రాజేందర్ అని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అ న్నారు. శనివారం ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేస్తున్న క్రమంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, టీబీజీకేఎస్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ను నమ్మి రెండుసార్లు మంత్రి పదవులిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేస్తూ పేదల భూములను అక్రమంగా ఆక్రమించుకున్న దళారీ అన్నారు. సమైక్యపాలనలో బతుకమ్మ పండుగకు గుర్తింపు ఇవ్వలేదని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కవిత ఏటా ఊరూరా తిరుగుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చైతన్య పరిచిన మహనీయురాలన్నారు. తెలంగా ణ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కవితక్కను విమర్శించే హక్కు ఈటలకు లేదన్నారు.
కవితక్క టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సింగరేణి కార్మికులకు అనేక హక్కులు నెరవేరాయన్నారు. సింగరేణిలో ముందుండి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి, వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. అంతేకాకుండా కవితక్క కల్పించిన ఈ అవకాశంతోనే నేడు సింగరేణిలో యువరక్తంతో సంస్థ నడుస్తోందని తెలిపారు. ‘కబ్జాకోరు రాజేందర్ నీ స్థాయిని మించి ఇంకోసారి కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతాం’అని హెచ్చరించారు. బడితల సమ్మయ్య, రతకనం సమ్మిరెడ్డి, సదానందం, నర్సింగరావు, రాజిరెడ్డి, శంకర్రెడ్డి, హఫీజ్ పాషా, శ్రీనివాస్, రాంచెందర్, అవినాశ్, రవి, సాంబయ్య, కుమార్, బాబుమియ, శ్రీకాం త్, అశోక్, ఓదేలు, సతీశ్, ప్రేమ్సింగ్ పాల్గొన్నారు.