పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కమలాపూర్, జూన్ 4: మండలంలోని ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని క్యాం పు కార్యాలయంలో కమలాపూర్, మర్రిపెల్లిగూడెం, గూడూ రు, కన్నూరు, భీంపల్లి, వంగపల్లి గ్రామాల కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో కేసీఆర్కు వస్తున్న ఆదరణ ఓర్వలేక ప్రతిపక్షాలు బురదచల్లేందుకు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కన్నూరు వార్డు సభ్యుడు నూనె సంపత్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మం డల ఇన్చార్జి పెరియాల రవీందర్రావు, సొసైటీ వైస్చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాయకులు పింగిళి ప్రదీప్రెడ్డి, సర్పంచ్లు కిరణ్మయి, అకంతి సాంబయ్య, కట్కూరి విజయ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఆంజనేయ విగ్రహావిష్కరణ..
పరకాల: పట్టణంలోని హుజూరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆంజనేయ విగ్రహాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్ర వారం ఆవిష్కరించారు. హనుమాన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరకాల శివారులో భారీ హనుమాన్ విగ్రహా న్ని ఏర్పాటు చేయగా, హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, ఒంటేరు సారయ్య, ఏకు రాజు, శ్రీ భవాని, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వెంటేశ్వర్లు, అసోసియేషన్ బాధ్యులు పింగిళి జైపాల్రెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, బీ ఆగయ్య, మొగిలి, గందె సత్యానందం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సారంగపాణి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.