మంగపేట, ఏప్రిల్ 3: మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురంలో ఆరు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన నాగులమ్మ జాతర శనివారం దేవతల వన ప్రవేశంతో ముగిసిం ది. ఆయా ప్రాంతాల భక్తులు ఉదయం నుంచి ఆల య ప్రాంగాణంలోని నాగులమ్మ, సడాలమ్మలకు పసుపు, కుంకుమ, నూతన వస్ర్తాలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. నాగులమ్మ ఉపాసకుడు బాడిశ రామకృష్ణస్వామి, ప్రధాన పూ జారి నాగరమేశ్, వడ్డెలు, పూజారుల బృందం భక్తులకు నాగులమ్మ బండారి(పసుపు కుంకుమ) అందజేశారు. అనంతరం గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి, డోలు వాయిద్యాల నడుమ నాగులమ్మను గండొర్రె గుట్టకు, సడాలమ్మను యె ర్రెట్టల గుట్టకు వనప్రవేశానికి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల్లో నాగులమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు రామకృష్ణస్వామి, ప్రధాన పూజారులు బాడిశ నాగరమేశ్, నవీన్, కొమరం ధనలక్ష్మి, గాయత్రి, నాగలక్ష్మి, దేవిక, సోడి శ్రీను, భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
బంగ్లాదేశ్లో ఏడు రోజుల పాటు లాక్డౌన్