నెల్లికుదురు, ఏప్రిల్ 1 : ఆడ జన్మ అత్యున్నతమైనదని, ఆడపిల్లలను రక్షించడం అందరి బాధ్యతని మండల ప్రత్యేకాధికారి బాలరాజు అన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ‘బేటి బచావో.. బేటి పడావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు దేవతలతో సమానమన్నారు. భ్రూణ హత్యలను అరికట్టాలని, మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండో కాన్పులో ఆస్త్రీని అనునిత్యం పరీక్షించాలన్నారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అన్నారు. బాల్య వివాహాలు చేస్తున్నట్లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 1098కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ అనంతుల రమేశ్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
బైరాన్పల్లిలో ప్రసిద్ధ జైనబసది
నగరి ఎమ్మెల్యే రోజాకు అస్వస్థత