జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అనినవ్
రూ.8.22 కోట్ల మున్సిపల్ బడ్జెట్కు ఆమోదం..
తొర్రూరు, మార్చి 31 : తొర్రూరు మున్సిపల్ సమగ్ర అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఎం రామచంద్రయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన పాలకవర్గంతో ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంలో 2021- 2022 వార్షిక సంవత్సరానికి రూ.8 కోట్ల 22 లక్షల బడ్జ్జెట్కు ఆమోద ముద్రవేశారు. తొర్రూరు మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాలకవర్గం సమన్వయంతో అన్ని వార్డులను అభివృద్ధి చేసుకోవాలని, సమస్యల ప్రాతిపధికన పనులను పూర్తి చేయాలన్నారు. రూ.3.8 కోట్లు మున్సిపాలిటీ స్వతాహగా వివిధ పన్నుల రూపాల్లో మున్సిపాలిటీకి సమకూర్చనున్నట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని, లేకుంటే జరిమానా విధించాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది కొరత ఉందని పాలకవర్గం కోరడంతో, సానుకులంగా ఆయన స్పందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి, వార్డు కౌన్సిలర్లు రాము, రోజా, సంగీత, యమునా, సునీత, నట్వర్, గజానంద్, అలివేలు, రేవతి, నాగజ్యోతి, శంకర్, శ్రీనివాస్రావు, శంకర్, మాధవి, జేఎస్వో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నిలపాలి
డోర్నకల్: మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నిలపాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం డోర్నకల్ మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ వాంకుడోత్ వీరన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వం అందించే వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులు కాకుండా వారాంతపు సంతలు, షాపింగ్ కాంప్లెక్స్ అద్దెల ద్వారా వచ్చే ఆదాయలను సమకుర్చుకున్నప్పుడే మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెంట్ నిర్మించిన తర్వాత వచ్చే ఆదాయం పెంచుకోవాలని సూచించారు. పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా సరిపడ నీళ్లు అందడంలేదని కౌన్సిలర్లు జనార్దన్, బోడ అమల సభ దృష్టికి తీసుకువచ్చారు. 8వ వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్యి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, మున్సిపల్ ఇన్చార్జీ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ భిక్షపతి, వార్డుకౌన్సిలర్లు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.