జడ్చర్ల: ఆరెకటికెల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్.సి. లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్లో జడ్చర్ల నియోజకవర్గ స్థాయి ఆరెకటికెల సంఘం సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భగా ఆరెకటికలు పలు డిమాండ్లను ఎమ్మెల్యే ముందు ఉంచారు. మోబైల్ మటన్శాలలు రద్దు చేయాలని, ఆరెకటికెలను బీసీడీ నుంచి ఏ కు మార్చాలని, నూతన మద్యం పాలసీలో రిజర్వేషన్లు కల్పించాలని, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేయాలని, మాంసం వృత్తిని ప్రభుత్వం గుర్తిం చాలని, ఇందుకు సంబధించిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డికి అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలు, బీదలు బాగు పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమపథకాలను తీసుకువచ్చి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆరెకటికెల సమస్యలను ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కరించేవి తాను పరిష్కరిస్తానని, మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.
జడ్చర్ల ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు వలన ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. బాదేపల్లిలో మటన్ మార్కెట్ను ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. జడ్చర్లలో ఆరెకటికెల సంఘం భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేయిస్తానని తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర సంగీతనాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణిల్చందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు కోట్లప్రశాంత్రెడ్డి, లత, ఉమా శంకర్గౌడ్, మాజీ సర్పంచ్ రేణుక, నాయకులు నాగిరెడ్డి, ఇమ్ము, రామ్మోహన్, నర్సిములు, కిరణ్, సంఘం నాయకు లు అశోక్, భాగ్యలక్ష్మి, పర్వత్లాల్, మధు, శ్రీనివాస్, మనోహర్, శివ, యాదిలాల్, నాగోజి, నిరంజన్ పాల్గొన్నారు.